ఇంఫాల్ : మణిపూర్లో దారుణా లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక ఆర్మీ జవాన్ మృతదేహాన్ని ఇం ఫాల్ తూర్పు జిల్లాలోని ఖునింగ్టెక్ గ్రామంలో పోలీసులు ఆదివారం కనుగొన్నారు. ఇతడిని కొందరు ఉగ్రవాదులు అపహరించి కాల్చి చంపినట్టు అధికారులు తెలిపారు.
మరణించిన సేపోయ్ కోమ్కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నా రు.సెపోయ్ కోమ్ శనివారం తరుంగ్ గ్రామంలోని తన ఇంటిలో ఉండగా ముగ్గురు సాయుధులైన దుండగులు వచ్చి తుపాకితో అతడిని బెదిరించి తమ వాహనంలో అపహరించుకుని పోయారు. అయితే ఆదివారం అతని మృతదేహం సాగల్మంగ్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఖునింగ్టెక్ గ్రామం లో లభ్యమైంది. అతని తలలో తుపాకితో కాల్చిన గుర్తులున్నట్టు పోలీసులు తెలిపారు.