న్యూఢిల్లీ: ఓయో ఫౌండర్ రితేవ్ అగర్వాల్(Ritesh Agarwal) వెడ్డింగ్ రిసెప్షన్ మంగళవారం ఢిల్లీలో జరిగింది. ఆ వేడుకకు సాఫ్ట్బ్యాంక్(Softbank) చీఫ్ మసొయోషి సన్(Masoyoshi Son) హాజరయ్యారు. ప్రస్తుతం యంగెస్ట్ బిలియనీర్గా ఉన్న రితేశ్.. జపాన్కు చెందిన ఇన్వెస్టర్ మాసొయోషి ఆశీర్వాదం తీసుకున్నారు. సాఫ్ట్బ్యాంక్ చీఫ్ పాదాలను రితేశ్ తాకారు. 2013లో ఓయోను రితేశ్ స్థాపించారు. అప్పుడు ఆయన వయసు కేవలం 19 ఏళ్లు మాత్రమే.
యువ ఔత్సాహిక వ్యాపారవేత్త గీతాన్ష సూద్(Geetansha Sood)ను రితేశ్ పెళ్లాడారు. ఆ పెళ్లి వేడుకకు చాలా మంది కార్పొరేట్ దిగ్గజాలు హాజరయ్యారు. పేటీఎం ఓనర్ విజయ్ శేఖర శర్మ, లెన్స్కార్ట్ ఓనర్ పీయూష్ బన్సాల్లు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ కూడా ఫోటోలను షేర్ చేశారు.
ఓయో హోటల్స్ గ్రూపునకు ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. బడ్జెట్ హోటల్స్(Budget Hotels)తో ఆ సంస్థ జతకట్టింది. సుమారు 800 నగరాల్లో ఆ హోటల్ గ్రూపు ఆపరేట్ చేస్తున్నది. ఓయోలో సాఫ్ట్బ్యాంక్ భారీ పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే.