హైదరాబాద్: ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ స్నాప్డీల్, భారత్లోని మిలియన్ల మంది యూజర్లతో వారి స్థానిక భాషలో కనెక్ట్ అయ్యేందుకు మేడ్-ఇన్-ఇండియా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ “కూ”లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నది. దేశంలోని చిన్న నగరాలు, పట్టణాల్లో ఇ-కామర్స్ కు రోజురోజుకీ ఆదరణ పెరుగుతున్నది. కస్టమర్ల ప్రత్యేక అవసరాలు, లోకల్ కంటెంట్ కు డిమాండ్ పెరుగుతోంది. దీంతో తమ వినియోగదారులకు మరింతగా చేరువయ్యేందుకు స్నాప్ డీల్ “కూ”యాప్ లో చేరింది.
స్నాప్ డీల్ భారతదేశం అంతటా, ప్రత్యేకించి టైర్ టూ, టైర్ త్రీ పట్టణాల్లోని వినియోగదారులతో వారి మాతృభాషలో విక్రయాలు,డీల్స్,ఆఫర్ల గురించి తెలిపేందుకు “కూ”యాప్ లోని వినూత్నమైన ఫీచర్లను ఉపయోగించుకోనున్నది. స్థానిక భాషలలో సేవలందించేందుకు”కూ”యాప్ హిందీ, బెంగాలీ, అస్సామీ, తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, గుజరాతీ ,ఇంగ్లీష్ వంటి తొమ్మిది భాషల్లో తనసేవలను అందిస్తుంది.15మిలియన్లకు పైగా ఉన్న ప్రస్తుత యూజర్ బేస్ నుంచి,వేగంగా అభివృద్ధి చెందుతున్న మైక్రో-బ్లాగింగ్ ప్లాట్ఫామ్ వచ్చే ఏడాదిలో 100 మిలియన్ డౌన్లోడ్లను చేరుకోగలదని భావిస్తున్నారు.
స్నాప్డీల్ బ్రాండ్ మార్కెటింగ్ డైరెక్టర్ సౌమ్యదీప్ ఛటర్జీ మాట్లాడుతూ “మొబైల్ ఇంటర్నెట్ యాక్సెస్ రిమోట్ లొకేషన్లలో నివసించే వారిని చేరుకోవడంతోపాటు వారితో స్థానిక భాషల్లో కమ్యూనికేట్ చేయడం సాధ్యమౌతుంది. అందుకు బహుభాషా కంటెంట్ను రూపొందించడం చాలా కీలకం. కూ వంటి ప్లాట్ఫామ్ స్థానిక కమ్యూనిటీలను నిర్మించడంలో మాకు సహాయపడుతుంది” అని అన్నారు.
.