కాఠ్మాండూ : భారతీయ స్కైడైవర్, పద్మశ్రీ గ్రహీత శీతల్ మహాజన్(41) మరో రికార్డు నమోదుచేశారు. ఆకాశంలో 21,500 అడుగుల ఎత్తులో, అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ఎదుట హెలిక్యాప్టర్ నుంచి స్కైడైవింగ్ చేసి చరిత్ర సృష్టించారు. సోమవారం నాటి ఈ ప్రదర్శనతో, ప్రపంచంలో అత్యంత ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసిన మొదటి మహిళగా ఆమె గుర్తింపు పొందారు.