నాగ్పూర్: మహారాష్ట్రంలోని నాగ్పూర్ జిల్లా కటోల్ తాలూకాలోగల సోన్ఖంబ్ ఏరియాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగ్పూర్ నుంచి కటోల్ వైపు ఏడుగురు ప్రయాణికులతో వెళ్తున్న కారును ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
ప్రమాదం జరిగిన తర్వాత స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. నుజ్జునుజ్జయిన కారులో తీవ్ర గాయాలతో ఇరుక్కుని ఉన్న ఆరుగురిని బయటికి తీసి నాగ్పూర్లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి ట్రామాకేర్ సెంటర్లో చికిత్స పొందుతూ క్షతగాత్రులంతా ప్రాణాలు కోల్పోయారు.
కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కారు నుజ్జయిన తీరును చూస్తుంటే లారీ చాలా వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టినట్లు తెలుస్తోందన్నారు. నిందితులంతా 26 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు వారే ఉన్నారు.