న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అమానుష ఘటన చోటుచేసుకున్నది. హోంవర్క్ చేయలేదని ఇద్దరు చిన్నారులను ప్లాస్టిక్ పైపుతో విచక్షణారహితంగా కొట్టాడు ట్యూషన్ టీచర్ (Tuition teacher). ఆరు, ఎనిమిదేండ్ల వసయస్సున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇంటి పక్కన ఉన్న ట్యూషన్కు వెళ్తున్నారు. అయితే ఆగస్టు 31న వారిద్దరు హోంవర్క్ చేయలేదు. గుర్తించిన ట్యూషన్ టీచర్ వారిని ఓ గతిలోకి తీసుకెళ్లి.. ప్లాస్టిక్ పైపుతో ఒళ్లంతా బొబ్బలు వచ్చేలా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారులు ఏడ్చుకుంటూ తమ ఇంటికి వెళ్లారు. విషయం తెలుసుకున్న వారి తండ్రి వెంటనే దవాఖానకు తీసుకెళ్లాడు.
అనంతరం ఢిల్లీ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన మహిళా కమిషన్ స్థానిక పోలీసులకు నోటీసులు జారీచేసింది. ట్యూషన్ టీచర్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.