న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలాకు పాలిగ్రాఫ్ టెస్ట్ పూర్తయిందని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీస్ అసిస్టెంట్ డైరెక్టర్ సంజీవ్ గుప్తా తెలిపారు. ఆఫ్తాబ్కు గత వారం పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించడం మొదలుపెట్టామని ఇవాళ్టితో ఆ పరీక్ష ముగిసిందని చెప్పారు.
ఈ కేసు ప్రత్యేకమైనది కాబట్టి సాధ్యమైనంత త్వరగా పాలిగ్రాఫ్ టెస్ట్ పూర్తి చేశామని గుప్తా పేర్కొన్నారు. త్వరలోనే ఈ టెస్టుకు సంబంధించిన నివేదికను పోలీసులకు అందజేయనున్నట్లు తెలిపారు. నిందితుడు ఆఫ్తాబ్.. తనతో సహజీవనం చేస్తున్న యువతి శ్రద్ధావాకర్ను హత్యచేసి, 35 ముక్కలు చేసి, ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు.
నిందితుడు ఈ ఏడాది మే నెలలో హత్యకు పాల్పడగా, ఈ నెల మొదటి వారంలో వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పాలిగ్రాఫ్ టెస్టు పూర్తికాగా, ఇక నార్కో ఎనాలసిస్ టెస్టు కూడా చేయనున్నారు.