న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్నది. పోలీసులు గత కొన్ని రోజులుగా నిందితుడు ఆఫ్తాబ్ను కస్టడీలోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తున్నాయి. నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు వివిధ ప్రాంతాల్లో శ్రద్ధ దేహ భాగాల కోసం వెతుకుతున్నారు.
ఇవాళ మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో పోలీసులకు పుర్రె ఆధార భాగం, విరిగిన దవడ ఎముక, మరికొన్ని ఇతర ఎముకలు లభ్యమయ్యాయి. అవి శ్రద్ధా వాకర్కు సంబంధించినవేనా..? కావా..? అనే విషయాన్ని నిర్ధారించుకోవడం కోసం పోలీసులు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. శ్రద్ధ తండ్రి డీఎన్ఏతో ఆ ఎముకల డీఎన్ఏను పోల్చి చూడనున్నారు.
హత్యకు ముందు శ్రద్ధా వాకర్, ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా ఇద్దరూ ముంబై నుంచి ఢిల్లీకి వచ్చి, ఛత్తార్పూర్లో గది అద్దెకు తీసుకుని సహజీవనం చేశారు. ఈ ఏడాది మే 18న ఖర్చుల విషయమై ఇద్దరి మధ్యల గొడవ జరగడంతో శ్రద్ధను ఆఫ్తాబ్ గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని మాయం చేయడం కోసం.. దేహాన్ని 35 ముక్కలు చేసి ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు.