చెన్నై: ఎయిర్ అరేబియా విమానం ఆదివారం ఉదయం చెన్నై విమానాశ్రయంలో దిగి రన్ వేపై వెళుతున్నప్పుడు ఒక ప్రయాణికుడు(34) అత్యవసర ద్వారాన్ని తెరచి కిందికి దూకిన ఘటన ఉత్కంఠను రేపింది. విమానాశ్రయ అధికారుల వివరాల ప్రకారం.. షార్జా నుంచి చెన్నై వచ్చిన విమానంలో ఈ ఘటన జరిగింది.
ప్రయాణికుడి అనుచిత చర్యను గమనించిన వెంటనే పైలట్ విమానాన్ని ఆపేసి ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. భద్రతా సిబ్బంది, బాంబు నిర్వీర్య దళం వెంటనే అక్కడికి చేరుకొని సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొన్నారు. అతడి మానసిక స్థితిని పరిశీలిస్తున్నారు. అతడు అలా ఎందుకు దూకాడో విచారణ చేస్తున్నారు. పైలట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నిందితుడిని పుదుక్కొైట్టె వాసిగా గుర్తించారు.