లక్నో : శివపాల్ సింగ్ యాదవ్ నేతృత్వంలోని ప్రోగ్రెసివ్ సమాజ్ వాదీ (ఎల్) పార్టీ.. ఎస్పీలో విలీనం కానుంది. ఈ మేరకు ఆ పార్టీ అ ధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ను గురువారం లక్నోలో శివపాల్ యాదవ్ కలిశారు. కార్యకర్తలతో సమావేశం అనంతరం ఆయన పార్టీని ఎస్పీలో విలీనం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, శివపాల్ మద్దతుదారులకు ఎన్ని టికెట్లు ఇస్తారని ఇంకా ఖరారు కాలేదు.
ప్రస్తుతం 15 మంది మద్దతుదారులకు టికెట్లు ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం అఖిలేష్ యాదవ్ పలు జిల్లాల్లో విజయ రథయాత్ర నిర్వహిస్తున్నారు. జౌన్పూర్లో బుధవారం మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు అవాస్తవమన్నారు.