మహావికాస్ అగాఢీ ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో వుంటుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. అలాగే మహారాష్ట్రలో తిరిగి అధికారాన్ని కూడా చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి తాము తిరిగి పగ్గాలు చేపడతామని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సంజయ్ రౌత్ పై వ్యాఖ్యలు చేశారు. ఉద్ధవ్ సర్కార్ ఏలుబడిలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచాయి. మరో రెండున్నరేళ్లు కూడా గడుస్తాయి. 2024 లో ఎన్నికలు వస్తాయి. అప్పుడు కూడా మళ్లీ మేమే గెలుస్తాం అని సంజయ్ రౌత్ ధీమా వ్యక్తం చేశారు.
గోవాలో కూడా తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలకు సంజయ్ రౌత్ కౌంటర్ ఇచ్చారు. పోర్చుగ్రీసులు, బ్రిటీషు వాళ్లే గోవాను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారని, రాజకీయ పార్టీలు కూడా గోవాను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాయని అన్నారు. బీజేపీకి గోవా అర్థమవుతుందా? అంటూ సంజయ్ ఎద్దేవా చేశారు.