Assembly Election Results 2023: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి సత్తా చాటారు. 18 ఏండ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న ఆయన తాజాగా బీజేపీని మరోసారి అధికారంలోకి తెచ్చారు. తాజా ఎన్నికలలో శివరాజ్ సింగ్ చౌహాన్.. రామాయణం టెలివిజన్ షో నటుడు హనుమంతుడిగా నటించి మెప్పించిన విక్రమ్ మస్తాల్ శర్మను ఓడించారు. బుధినీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న శివరాజ్ సింగ్ చౌహాన్.. మస్తాల్పై ఏకంగా 1,04,974 ఓట్ల మెజారీతో విజయం సాధించారు. చౌహాన్కు 1,64,951 ఓట్లు రాగా విక్రమ్ కుమార్కు 59,977 ఓట్లు వచ్చాయి.
మస్తాల్ 2008లో హిందీలో వచ్చిన రామాయణ్ టెలివిజన్ షో లో హనుమంతుడి పాత్ర వేసి మెప్పించారు. ఈ షో లో గుర్మీత్ చౌదరి రాముడిగా మెప్పించగా డెబినా బెనర్జీ సీతగా అలరించింది. మస్తాల్ శర్మ ఈ ఏడాది జులైలో కాంగ్రెస్లో చేరి టికెట్ దక్కించుకున్న విషయం విదితమే.