న్యూఢిల్లీ: పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడటంతో అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. నామినేషన్ల ఘట్టం కూడా మొదలైంది. తాజాగా శిరోమణి అకాలీదళ్ పార్టీ (ఎస్ఏడీ) అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ జలాలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఇంతకుముందే పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కూడా పటియాలా స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లారు.
కాగా, పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ పార్టీ ఈ ఎన్నికల్లో మాయవతి నేతృత్వంలో బహుజన్ సమాజ్వాది పార్టీతో జట్టుగా బరిలో దిగుతున్నది. ఎప్పుడూ బీజేపీతో పొట్టుపెట్టుకునే ఎస్ఏడీ ఈసారి ఆ పార్టీకి కటీఫ్ చెప్పింది. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఎస్ఏడీ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగింది.
ఇలా వివాదాస్పద వ్యవసాయ చట్టానలను వ్యతిరేకించడం ద్వారా రైతులను మద్దతును, బీఎస్పీతో పొత్తు ద్వారా పంజాబ్లోని దళిత సామాజిక వర్గం మద్దతును కూడగట్టుకోవచ్చని ఎస్ఏడీ భావిస్తున్నది. ఇక పంజాబ్ లోక్ కాంగ్రెస్, బీజేపీ మరో కూటమిగా బరిలో దిగుతున్నాయి. అయితే, ప్రధాన పోటీ మాత్రం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యనే ఉన్నది.