చండీగఢ్: పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు మరో 20 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో ప్రచారం జోరందుకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష ఆప్తోపాటు శిరోమణి అకాలీదళ్, బీజేపీ, బీఎస్పీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీలు పోటీపడి ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంతోపాటే పంజాబ్లో నామినేషన్ల పర్వం కూడా ఊపందుకున్నది.
పలువురు నేతలు రిటర్నింగ్ కార్యాలయాలకు వెళ్లి తమ నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ పటియాలాలో నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్సింగ్ బాదల్ జలాలాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ వేశారు.
తాజాగా సుఖ్బీర్సింగ్ తండ్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రకాశ్సింగ్ బాదల్ కూడా లంబి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశారు. తన అనుచరులతో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు.