Shirdi sansthan trust | షిర్డీ, ఏప్రిల్ 27: షిర్డీలోని ప్రసిద్ధ సాయిబాబా దేవస్థానంలో సీఐఎస్ఎఫ్తో భద్రత నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వ్యతిరేకించింది.
ఇందుకు నిరసనగా మే 1 నుంచి నిరవధికంగా బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఇప్పటి వరకు మహారాష్ట్ర పోలీసులు ఆలయ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కాగా, షిర్డీ విమానాశ్రయ భద్రతను 2018 నుంచి సీఐఎస్ఎఫ్ పర్యవేక్షిస్తున్నది.