Sherin shahana | తిరువనంతపురం, మే 24: కేరళలోని వాయనాడ్కు చెందిన షెరిన్ షహనా(25)కు సివిల్స్ సాధించాలనేది జీవితాశయం. అయితే, 2015లో ఆమె తండ్రి మరణించారు. కుటుంబపెద్దను కోల్పోయిన బాధ ఒకవైపు, ఆర్థిక సమస్యలు మరోవైపు ఆ కుటుంబాన్ని వేధిస్తుండగానే 2017లో షెరిన్ ప్రమాదవశాత్తూ భవనం మీద నుంచి కిందపడింది. ఆమె వెన్నెముకకు గాయమైంది. నడుము కింద భాగం, చేయి పక్షవాతానికి గురైంది.
రెండేండ్ల పాటు మంచానికే పరిమితమైంది. షెరిన్ క్రమంగా కోలుకున్నా వీల్చైర్కే పరిమితమైంది. దీంతో తన కల అయిన సివిల్స్ సాధించి, తన కోసం ఇంత శ్రమించిన తల్లి, సోదరి గర్వపడేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కష్టపడి చదివి అనుకున్నది సాధించింది. తాజాగా వెల్లడైన సివిల్స్ ఫలితాల్లో 913వ ర్యాంకు సాధించింది. ఇప్పటికే ఆమె నెట్ – జేఆర్ఎఫ్ సాధించి కాలికట్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నది.