న్యూఢిల్లీ: దేశంలో 2014-15లో 918గా ఉన్న లింగ నిష్పత్తి 2022-23 నాటికి 15 పాయింట్లు పెరిగి 933కు చేరిందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం లోక్సభలో వెల్లడించారు. గతంతో పోలిస్తే ఆడపిల్లల జననాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.
గతంలో ప్రతి వెయ్యిమంది మగ వాళ్లకు 918 మంది మాత్రమే ఆడవాళ్లు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 933కు చేరింది. సభ్యుడొకరు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ ప్రజల ఆలోచనా ధోరణిలో గణనీయమైన మార్పు వల్లే లింగ నిష్పత్తి పెరిగిందన్నారు.
నీయమైన మార్పు వల్లే లింగ నిష్పత్తి పెరిగిందన్నారు.