న్యూఢిల్లీ: మణిపూర్(Manipur)లో జరిగిన కాల్పుల్లో ఏడు మంది సెక్యూర్టీ సిబ్బంది గాయపడ్డారు. మిలిటెంట్లతో జరిగిన ఫైరింగ్లో నలుగురు పోలీసు కమాండోలు, ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. మణిపూర్లోని మోరేహ్లో ఈ ఘటన జరిగింది. భారత్, మయన్మార్ బోర్డర్ వద్ద ఉన్న మోరేహ్ టౌన్ వద్ద పోలీసు కమాండోలపై రాకెట్-గ్రేనేడ్ తో దాడి చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా జరిగిన ఘటనలో నలుగుర్ని కాల్చి చంపారు. అనేక మంది గాయపడ్డారు. దీంతో అక్కడ అయిదు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు.