న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: మసీదులకు అనుబంధంగా ఉండే సేవా ఇమామ్ల భూములు వక్ఫ్ ఆస్తిలో భాగమని, అందువల్ల వాటిని అన్యాక్రాంతం చేయలేమని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. మతపరమైన లేదా ధార్మిక ప్రయోజనాల కోసం సేవా ఇనామ్గా మంజూరు చేసిన భూములు దాన ఆస్తి స్వభావాన్ని సంతరించుకుంటాయని, ప్రజా లేదా మతపరమైన ట్రస్టును కలిగి ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
వాటి బదిలీకి పరిమితులు నిస్సందేహంగా ఉంటాయని జస్టిస్ సుందరేష్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ప్రతివాదికి అనుకూలంగా సర్వీస్ ఇమామ్ భూమి అన్యాక్రాంతాన్ని రద్దు చేయాలన్న వక్ఫ్ ట్రిబ్యూనల్ నిర్ణయాన్ని తోసిపుచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. కర్నూలు జిల్లాలోని 3 ఎకరాల భూమికి సంబంధించినది ఈ కేసు. ఈ భూమి ఒక మసీదులో మతపరమైన సేవల కోసం మంజూరైన వక్ఫ్ ఆస్తి(సేవా ఇనామ్).