ముంబై: ఆర్బీఐ నిర్ణయంతో స్టాక్ మార్కెట్లు ఇవాళ డీలాపడ్డాయి. రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు శక్తికాంత్ దాస్ ప్రకటించిన తర్వాత స్టాక్ మార్కెట్లు పతనం అయ్యాయి. రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఇవాళ ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. దాస్ ప్రకటన తర్వాత సెన్సెస్ ట్రేడింగ్లో 14000 పాయింట్లు కోల్పోయింది. మరోవైపు నిఫ్టీ ట్రేడింగ్లో 429 పాయింట్లు నష్టపోయింది. అత్యధికంగా అపోలో హాస్పిటల్స్ గ్రూపు షేర్లు 6.43 శాతం పతనం అయ్యాయి. అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హిండాల్కో కంపెనీలు కూడా నష్టపోయాయి.