న్యూఢిల్లీ: విదేశీ విలేకరుల క్లబ్ (ఎఫ్సీసీ) దక్షిణాసియా అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు ఎస్ వెంకట్నారాయణ్ ఎన్నికయ్యారు. ఆయన ఈ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇది మూడోసారి. సోమవారం ఢిల్లీలో జరిగిన వార్షిక సర్వసభ సమావేశంలో వెంకట్ నారాయణ్ అధ్యక్షుడిగా కొత్త కమిటీని ఎన్నుకున్నారు.
కరీంనగర్ జిల్లాకు చెందిన వెంకట్ నారాయణ్ 1968 నుంచి జర్నలిజంలో కొనసాగుతున్నారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ వార్తాసంస్థలకు విదేశాల్లో ప్రతినిధిగా వ్యవహరించారు. ది సండే టైమ్స్, బోస్టన్ గ్లోబ్ వంటి ప్రఖ్యాత సంస్థల్లో పని చేశారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్లో ఎఫ్సీసీ దక్షిణాసియాకు సభ్యత్వం ఉంటుంది.