న్యూఢిల్లీ: బీహార్ సీఎం నితీశ్ కుమార్కు అత్యంత సన్నిహితుడు, జేడీయూ సీనియర్ నాయకుడు కేసీ త్యాగి మంగళవారం తన పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తన తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని ఆయన చెప్పారు. 2003 అక్టోబర్లో జనతాదళ్లో సమతాపార్టీ విలీనమైన తర్వాత ఆవిర్భవించిన జనతాదళ్(యూ)లోనే కొనసాగుతున్న త్యాగి వివిధ హోదాల్లో పార్టీ కోసం పనిచేశారు. నితీశ్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన మరుసటి రోజే త్యాగి పార్టీని వీడడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.