లక్నో: పాకిస్థాన్ జాతీయురాలైన సీమా హైదర్ (Seema Haider), తన ప్రియుడు, పిల్లలతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. ఉత్తరప్రదేశ్ నోయిడాకు చెందిన ప్రియుడు సచిన్ మీనాతో కలిసి ఉంటున్న ఆమె ఆదివారం జరిగిన ‘హర్ ఘర్ తిరంగా’ వేడుకలో పాల్గొన్నది. ఈ సందర్భంగా ఇంటి వద్ద భారత జాతీయ జెండాను ఎగురవేయడంతోపాటు భారత్ అనుకూల నినాదాలు చేసింది. అలాగే సినిమా ఆఫర్ను తిరస్కరించినట్లు సీమా హైదర్తోపాటు ఈ వేడుకలో పాల్గొన్న ఆమె తరుఫు న్యాయవాది ఏపీ సింగ్ మీడియాకు తెలిపారు.
కాగా, పాకిస్థాన్లోని భర్తను వీడి తన పిల్లలతో కలిసి భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్, నోయిడాకు చెందిన ఆమె ప్రియుడు సచిన్ మీనాతో కలిసి ఉంటున్నది. దీంతో వీరి లవ్ స్టోరీ ఆధారంగా ‘కరాచీ టు నోయిడా’ పేరుతో సినిమా తీయాలని నిర్మాత అమిత్ జానీ భావించారు. ఈ నేపథ్యంలో సీమా హైదర్ షూటింగ్లో పాల్గొన్న వీడియో క్లిప్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు మహారాష్ట్రలోని రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) నేత అమేయా ఖోప్కర్ దీనిపై స్పందించారు. భారతీయ సినీ పరిశ్రమలో పాకిస్థాన్ పౌరులకు స్థానం లేదని అన్నారు. దీనిపై తాము గట్టిగా నిలబడతామని తెలిపారు. భారత్లో ఉంటున్న పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ ఐఎస్ఐ ఏజెంట్ అన్న వదంతులు కూడా ఉన్నాయని చెప్పారు. అలాగే సినీ పరిశ్రమలో పైప్ కోసం సీమా హైదర్ను నటిగా మార్చడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ దేశద్రోహ నిర్మాతలకు సిగ్గులేదా? అని ప్రశ్నించారు. సినిమా నాటకానికి తక్షణం ముగింపు పలకాలని అన్నారు. లేకపోతే ఎంఎన్ఎస్ చర్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అమేయా ఖోప్కర్ ఈ మేరకు మరాఠీలో ట్వీట్ చేశారు.
ఈ హెచ్చరిక నేపథ్యంలో సినిమా ఆఫర్ను తిరస్కరించినట్లు సీమా హైదర్ తెలిపింది. ‘హర్ ఘర్ తిరంగా’ వేడుకలో ఆమె పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Pakistan national Seema Haider hoists Indian tricolour ahead of Independence Day#Paksitan #seemahaidar #IndependenceDay #Tricolor #Tiranga pic.twitter.com/mZjjGJB6xG
— News18 (@CNNnews18) August 13, 2023