లక్నో: ఒక వ్యక్తి ఎంచక్కా గొడుగు వేసుకుని రైలు పట్టాలపై నిద్రించాడు. (Man Sleeps On Railway Track) ఒక రైలు అతడ్ని సమీపించింది. గమనించిన లోకో పైలట్ ఆ రైలును నిలిపివేశాడు. ఆ వ్యక్తిని నిద్ర లేపి రైలు పట్టాల నుంచి పక్కకు వెళ్లమని చెప్పాడు. ఆ తర్వాత ఆ రైలు ముందుకు కదిలింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ సంఘటన జరిగింది. చిరు జల్లులు పడుతుండగా ఒక వ్యక్తి ఎంచక్కా గొడుగు వేసుకుని రైల్వే ట్రాక్పై నిద్రించాడు. రైలు పట్టాలపై తల పెట్టి మధ్యలో పడుకున్నాడు.
కాగా, ఒక రైలు ఆ వ్యక్తిని సమీపించింది. రైలు పట్టాలపై అతడు నిద్రపోతుండటాన్ని గమనించిన లోకో పైలట్ రైలును నిలిపివేశాడు. ఇంజన్ నుంచి కిందకు దిగి ఆ వ్యక్తి వద్దకు చేరుకున్నాడు. మంచి నిద్రలో ఉన్న అతడ్ని తట్టి లేపాడు. రైలు పట్టాల నుంచి పక్కకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆ రైలు అక్కడి నుంచి కదిలి వెళ్లింది.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఆ వ్యక్తి చనిపోయే ఉద్దేశంతో రైలు పట్టాలపై పడుకున్నట్లుగా లేదని కొందరు అభిప్రాయపడ్డారు. అతడ్ని పిచ్చివాడిగా మరికొందరు అభివర్ణించారు. మద్యం మత్తులో రైలు పట్టాలపై నిద్రించి ఉంటాడని మరి కొందరు మండిపడ్డారు. ఆ వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.
A person was sleeping on the railway track with an umbrella. Seeing this, the loco pilot stopped the train, Then he woke him up and removed him from the track. Then the train moved forward in Prayagraj UP
pic.twitter.com/OKzOpHJeih— Ghar Ke Kalesh (@gharkekalesh) August 25, 2024