జమ్ము: జమ్ముకశ్మీర్లో భారీ ఉగ్రకుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. స్వాతంత్య్ర దినోత్వ వేడుకలు సమీపిస్తున్న వేళ పుల్వామాలోని (Pulwama) తహబ్ క్రాసింగ్ వద్ద పెద్దమొత్తంలో పేలుడు పదార్ధాలను భద్రతా పట్టుకున్నాయి. తహబ్ క్రాసింగ్ సమీపంలో 25 నుంచి 30 కిలోల బరువున్న ఐఈడీ (మందుపాతర)ని జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని నిర్మానుష్య ప్రదేశంలో అధికారులు పేల్చివేశారు.
#WATCH | J&K: An IED weighing, approx 25 to 30 Kgs, that was recovered near Tahab Crossing on Circular road in Pulwama by Police and security forces today, has now been defused.
(Video Source: Indian Army) https://t.co/H4w9TBYWEl pic.twitter.com/OkECS073zg
— ANI (@ANI) August 10, 2022
కాగా, పుల్వామా పోలీసులు అందించిన విశ్వనీయ సమాచారం మేరకు తహబ్ క్రాసింగ్ వద్ద తనిఖీలు నిర్వహించామని.. ఈక్రమంలో సుమారు 30 కిలోల పేలుడు పదార్థాలు లభించాయని కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ చెప్పారు.