శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని చినాబ్ నదిపై నిర్మించిన రైల్వే బ్రిడ్జ్(Chenab Rail Bridge) .. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్పై ఇవాళ భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఏదైనా విపత్తు సంభవిస్తే ఎలా అప్రమత్తం కావాలన్న ఉద్దేశంతో ఆ డ్రిల్ను చేపట్టారు. సుందరమైన ప్రకృత ప్రదేశంలో నిర్మించిన చీనాబ్ బ్రిడ్జ్.. ప్రస్తుతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈఫిల్ టవర్ కన్నా ఎత్తులో ఉన్న ఆ బ్రిడ్జ్పై భద్రతా దళాలు నిత్యం పహారా కాస్తున్నాయి.
రియాసి జిల్లాకు చెందిన పోలీసులతో పాటు ఎస్వోజీ, సీఆర్పీఎఫ్, 126బీఎన్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, వీడీజీ, సివిల్ అడ్మినిస్ట్రేషన్, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ, మెడికల్ బృందాలు కూడా మాక్ డ్రిల్లో పాల్గొన్నాయి. చినాబ్ నదిపై సుమారు 350 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ బ్రిడ్జ్ను రక్షించుకునేందుకు అన్ని శాఖలు సిద్ధంగా ఉన్నాయి. అద్బుతమైన ఇంజినీరింగ్ నైపుణ్యంతో నిర్మించిన ఈ బ్రిడ్జ్కు ఎటువంటి ప్రమాదం వచ్చినా, దాన్ని ఎదుర్కోనే రీతిలో భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాయి.