పాట్నా, జూన్ 15: బీహార్ సీఎం నితీశ్ మార్నింగ్ వాకింగ్ సందర్భంగా సెక్యూరిటీ వైఫల్యం చోటుచేసుకుంది. బైక్పై వచ్చిన వ్యక్తులు ఆయనను ఢీకొనబోయారు. గురువారం ఉదయం 7 గంటలకు నితీశ్ మార్నింగ్ వాక్ చేస్తూ అన్నే మార్గ్ నుంచి తన నివాసానికి వెళ్తుండగా, బైక్పై ఇద్దరు వ్యక్తులు అతివేగంగా దూసుకువచ్చారు.
ప్రమాదాన్ని గమనించిన నితీశ్ ఒక్కసారిగా రోడ్ పై నుంచి ఫుట్పాత్పైకి వెనక్కి గెంతారు. ఆయన అలా చేయకపోతే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది బైక్ స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నితీశ్పై గతంలో రెండుసార్లు ఇలాంటి దాడులు జరిగాయి.