న్యూఢిల్లీ, డిసెంబర్ 7: కీళ్లవాతానికి వాడే బారిసిటినిబ్ అనే మందుతో టైప్-1 మధుమేహాన్ని నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని ఈ మందు సంరక్షిస్తుందని మెల్బోర్న్కు చెందిన సెయింట్ విన్సెంట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ మందు వాడటం ప్రారంభించిన 100 రోజుల్లో ఆశాజనక ఫలితాలు వచ్చాయని వెల్లడించారు.