చండీగఢ్: హర్యానా కూడా ఢిల్లీ బాట పట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం స్థాయిలు పెరుగుతుండటంతో నేషనల్ క్యాపిటర్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలోని నాలుగు జిల్లాల్లో ఈ నెల 17 వరకు అన్ని స్కూళ్లను మూసివేసింది. గురుగ్రామ్, ఫరీదాబాద్, సోనిపట్, ఝజ్జర్ జిల్లాల పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లను ఈ నెల 17 వరకు మూసివేయాలని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం ఆదివారం ఆదేశించింది. ఈ నెల 17 వరకు అన్ని నిర్మాణ పనులపై కూడా నిషేధం విధించింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేయాలని అధికారులు సూచించారు.