లక్నో : పిల్లల్ని క్రమశిక్షణలో పెడుతూ వారికి విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ (Teacher Arrest) పెడదారిన పట్టిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. ముజఫర్నగర్లోని ఓ స్కూల్ టీచర్ ముస్లిం విద్యార్ధితో తన సహచర హిందూ విద్యార్ధి చెంప చెళ్లుమనిపించడం దుమారం రేగింది. ఈ ఘటన సెప్టెంబర్ 26న జరగ్గా టీచర్ను సజిస్తగా గుర్తించారు.
అయిదవ తరగతి చదివే బాలుడిని టీచర్ ఓ ప్రశ్నకు సమాధానం చెప్పాలని కోరగా, అతడు బదులివ్వకపోవడంతో ముస్లిం విద్యార్ధిచే బాధిత విధ్యార్ధి చెంప చెళ్లుమనిపించింది. ఈ ఘటనతో మనస్ధాపానికి లోనైన బాలుడు కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన టీచర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు అధికారులు టీచర్ను విధుల నుంచి తొలగించారు. కాగా ఇటీవల ముజఫర్నగర్లోని ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ ముస్లిం విద్యార్ధిని ఇతర విద్యార్ధులతో కొట్టించిన ఘటనలో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ముస్లిం విద్యార్ధిని సహచర విద్యార్ధులు కొడుతుండగా అతడు ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Read More :
Nipah virus: నిపా వైరస్ నుంచి కోలుకున్న నలుగురు.. శ్యాంపిల్ టెస్ట్లో నెగటివ్