న్యూఢిల్లీ: హర్యానాలో స్కూల్ బస్సు(School Bus) ప్రమాదానికి లోనైంది. పల్టీ కొట్టడంతో బస్సులో ఉన్న విద్యార్థులు గాయపడ్డారు. హర్యానాలోని నార్నౌల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈద్ ఉల్ ఫితర్ సెలవు ఉన్నా.. ఆ స్కూల్ను ఇవాళ తెరిచారు. జీఎల్ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సు.. ఉన్హాని గ్రామం వద్ద పల్టీ కొట్టింది.