న్యూఢిల్లీ: రిజర్వేషన్ అనేది శతాబ్దాలుగా వివక్షకు గురైన వారు సామాజిక, ఆర్థిక సాధికారత సాధించేందుకు ఉపయోగించేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. రిజర్వేషన్ల అంశంపై గురువారం (ఆరో రోజు) కూడా వాదనలు జరిగాయి.
పేదరికం శాశ్వతం కాదన్న కోర్టు.. అగ్రవర్ణ పేదలకు 10% కోటా ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ కల్పించటానికి బదులు ఆ వర్గాలకు స్కాలర్షిప్, ఉచిత విద్య వంటివి కల్పించటం మంచిదని కోర్టు పేర్కొన్నది. విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.