న్యూఢిల్లీ, మే 29: బ్యాంకింగ్ రంగంలో బుధవారం నుంచి వచ్చే మార్పులివే.. ఎస్బీఐ హోం లోన్ వడ్డీ పెంపు: గృహ రుణాలకు వడ్డీ రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచనున్నట్టు ఎస్బీఐ ఇప్పటికే ప్రకటించింది. ఇది జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నది. హోం లోన్లపై ఎస్బీఐ 7.05% వడ్డీని వసూలు చేయనున్నది.
మోటరు ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపు: థర్డ్ పార్టీ మోటరు ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లు జూన్ 1 నుంచి పెరగనున్నాయి. దీనిపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. వాహనాలను బట్టి ఈ ప్రీమియం రేట్లలో మార్పులు ఉంటాయి.
ఏఈపీఎస్ సేవలకు చార్జీ: ఆధార్ సాయంతో నగదు చెల్లింపుల వ్యవస్థ(ఏఈపీఎస్) సేవలకు చార్జీలు వసూలు చేస్తామని ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు(ఐపీపీబీ) ఇప్పటికే ప్రకటించింది. ఇది జూన్ 15 నుంచే అమల్లోకి రానున్నది. అయితే, మొదటి మూడు లావాదేవీలు ఉచితం. తర్వాతి ప్రతి లావాదేవిపై రూ.20+జీఎస్టీ వసూలు చేస్తారు. మినీ స్టేట్మెంట్ చూడాలంటే రూ.5+జీఎస్టీ వసూలుచేస్తారు.