అకోలా, నవంబర్ 17: కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్పై విమర్శలు చేశారు. బ్రిటిషర్లకు సావర్కర్ సహకరించారని అన్నారు. జైల్లో ఉన్న సావర్కర్ క్షమాభిక్ష కోరుతూ బ్రిటిషర్లకు అర్జీలు పెట్టుకున్నారని చెప్పారు.
మహారాష్ట్రలోని అకోలా జిల్లా వాడేగావ్లో గురువారం ఆయన మాట్లాడారు. 1920నాటి ప్రభుత్వ రికార్డులను మీడియా ఎదుట ఉంచారు. ఇందులో బ్రిటిష్వారికి సావర్కర్ రాసిన లేఖ ఆయన సంతకంతో ఉన్నదని వెల్లడించారు. భయంతోనే సావర్కర్ బ్రిటిషర్లకు లేఖలు రాశారని, మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్, జవహర్లాల్నెహ్రూ, ఇతర స్వాతంత్య్ర సమరయోధులకు ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే స్పందించారు. తనకు సావర్కర్పై అపార గౌరవం ఉన్నదని, రాహుల్ వ్యాఖ్యలను సమర్థించబోనని అన్నారు.