న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై వీర్ సావర్కర్ మనవడు పరువు నష్టం దావా వేశారు. ఇటీవల లండన్ పర్యటనలో తన తాతను అవమానించేలా రాహుల్ మాట్లాడారని సావర్కర్ సోదరుడి మనుమడైన సాత్యకీ సావర్కర్ ట్వీట్ చేశారు.
ఇటీవల రాహుల్ గాంధీ మాట్లాడుతూ బ్రిటన్లో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పటానికి తానేం సావర్కర్ను కాదని వ్యాఖ్యానించారు. మరోవైపు మోదీ ఇంటి పేరుకు సంబంధించిన పరువు నష్టం కేసులో ఈ నెల 20న తదుపరి విచారణ చేపడతామని సూరత్ సెషన్స్ కోర్టు గురువారం తెలిపింది.