Satyendra Jain | ఢిల్లీ మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సత్యేందర్ జైన్ సోమవారం తిహార్ జైలులో లొంగిపోయారు. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆరోగ్య సంబంధిత కారణాలతో ఆయన మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది. వెంటనే ఆయనను లొంగిపోవాలని ఆదేశించింది. బెయిల్ పిటిషన్పై ఆప్ నేత తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ, ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ బేలం ఎం త్రివేది, పంకజ్ మిథాల్ ధర్మాసనం ఈ ఏడాది జనవరి 17న తీర్పు రిజర్వ్ చేసింది.
తాజాగా సోమవారం తీర్పును వెలువరించింది. మనీలాండరింగ్ కేసులో డిసెంబర్ 14, 2023న ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ను ఇచ్చింది. అప్పటి నుంచి బెయిల్ను పొడిగిస్తూ వచ్చింది. ఈ కేసులో 2023, ఏప్రిల్ 6న ఢిల్లీ హైకోర్టు సత్యేందర్ జైన్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించగా.. ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తాజాగా సుప్రీంకోర్టులోనూ ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఆయన ఇంటి నుంచి జైలుకు బయలుదేరారు. ఇంటి వద్ద తన ఒడిలో ఉన్న పిల్లాడి మరొకరికి పక్కనే ఉన్న వ్యక్తికి ఇచ్చి అక్కడి కారులో తిహార్ జైలుకు బయలుదేరి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
#WATCH | Delhi: After the Court rejected his bail plea, former Delhi Minister and AAP leader Satyendar Jain left for Tihar Jail from his residence. https://t.co/A5lLYmdoqu pic.twitter.com/gSpKUXxhDj
— ANI (@ANI) March 18, 2024