న్యూఢిల్లీ, జనవరి 6: స్మార్ట్ఫోన్ వినియోగదారులకు శుభవార్త. ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ఈ ఏడాది చివరి నాటికి శాటిలైట్ కనెక్టివిటీ అందుబాటులోకి రానున్నది. ఇందుకోసం ప్రపంచ ప్రఖ్యాత మొబైల్ఫోన్ చిప్ల (ప్రాసెసర్ల) తయారీ సంస్థ క్వాల్కమ్కు, శాటిలైట్ ఫోన్ కంపెనీ ఇరిడియంకు మధ్య సరికొత్త ఒప్పందం కుదిరినట్టు తాజా కథనంలో బీబీసీ వార్తా సంస్థ వెల్లడించింది. దీంతో మొబైల్ కవరేజీ సరిగా లేని ప్రాంతాల్లో స్మార్ట్ఫోన్ల ద్వారా నింగిలో సంచరిస్తున్న ఉపగ్రహాలకు సమాచారాన్ని పంపి సందేశాలను ప్రసారం చేసేందుకు, రిసీవ్ చేసుకునేందుకు వీలవుతుంది. బ్రాండ్తో నిమిత్తం లేకుండా అదనంగా కోట్ల మంది స్మార్ట్ఫోన్ వినియోగదారులకు ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు క్వాల్కమ్, ఇరిడియం కసరత్తు చేస్తున్నాయి.