ముంబై, మే 10: ప్రముఖ సంగీత విద్వాంసుడు, సంతూర్ వాయిద్యకారుడు పండిత్ శివకుమార్ శర్మ(84) మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు.
శివకుమార్ తన ప్రత్యేక శైలితో సంతూర్ వాయిద్యానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చారు. సంగీత ప్రియులను ఎంతగానో అలరించిన ఆయనను భారత ప్రభుత్వం 1991లో పద్మశ్రీతో, 2001లో పద్మ విభూషణ్తో సత్కరించింది. శివకుమార్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు.