ముంబై : మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే అయోధ్య పర్యటనను వాయిదా వేసుకున్న నేపధ్యంలో కాషాయ పార్టీ రాజకీయ లబ్ధి కోసం ఎంఎన్ఎస్ చీఫ్ను వాడుకుంటోందని శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. అయోధ్యలో చేపట్టాల్సిన కార్యక్రమాలను ఎంఎన్ఎస్ రద్దు చేసుకుందని మీడియాలో వార్తలు వచ్చాయని, రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ చీఫ్ రాజ్ ఠాక్రేను బీజేపీ వాడుకుంటోందని అన్నారు.
అయోధ్యలో పెద్దసంఖ్యలో శివసేన మద్దతుదారులు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. కాషాయ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఠాక్రేను వాడుకుంటుంటే ఈ విషయాన్ని కొందరు ఆలస్యంగా గ్రహించారని అన్నారు. కాగా ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే అయోధ్య పర్యటనను వాయిదా వేస్తున్నట్టు శుక్రవారం వెల్లడించారు. శ్రీరాముడి ఆశీస్సులు పొందేందుకు జూన్ 5న అయోధ్య వెళతానని ఏప్రిల్ 17న పుణేలో ఠాక్రే ప్రకటించారు
. రామ మందిరం కోసం ఎంతోమంది కరసేవకులు తమ ప్రాణాలు అర్పించారని అన్నారు. కాగా, మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తొలగించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్ ఠాక్రే హెచ్చరించడంతో దేశవ్యాప్తంగా లౌడ్స్పీకర్ల వివాదం హాట్ టాపిక్గా మారింది. ఈ వ్యవహారంలో రాజ్ ఠాక్రేకు మహారాష్ట్ర బీజేపీ మద్దతుగా నిలిచి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘడి సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది.