ముంబై: శివసేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ (Sanjay Raut) ఇంటిపై ఈడీ అధికారులు దాడి చేశారు. పత్రాచల్ కేసులో ఆధారాల కోసం ఆదివారం ఉదయం నుంచి ముంబైలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మనీలాండరింగ్కు సంబంధించి సంజయ్రౌత్ను వించారించే అవకాశం ఉందని ఈడీ వర్గాలు వెల్లడించాయి.
Mumbai | Enforcement Directorate officials at Shiv Sena leader Sanjay Raut's residence, in connection with Patra Chawl land scam case pic.twitter.com/gFYdvR89zU
— ANI (@ANI) July 31, 2022
కాగా, మనీలాండరింగ్ వ్యవహారంలో విచారణకు హాజరుకావాల్సిందిగా సంజయ్కి ఈడీ ఇప్పటికే నోటీసులు జారీచేసింది. ఈనెల 20న ఈడీ కార్యాలయానికి రావాలని పేర్కొన్నది. అయితే పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో తాను ఆగస్టు 7న వస్తానని సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులే నేడు ఆయన ఇంటికి వెళ్లడం గమనార్హం. ఈ నెల 1న రౌత్ ఈడీ ముందు హాజరైన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో దాదర్, అలిబాగ్లోని ఆయన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.