ముంబై : ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే కాషాయ పార్టీ లౌడ్ స్పీకర్ అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. శివసేనకు ఎంఎన్ఎస్ హిందుత్వ గురించి బోధించలేదని మండిపడ్డారు. శివసేన నరనరానా హిందుత్వ ప్రవహిస్తుందని పేర్కొన్నారు.
ఉద్ధవ్ ఠాక్రే సర్కార్తో నేరుగా తలపడే ధైర్యం రాజ్ ఠాక్రే పార్టీకి లేదని ఎద్దేవా చేశారు. మే 3లోగా మసీదుల్లో లౌడ్స్పీకర్లు తొలగించాలని ఉద్ధవ్ ఠాక్రేకు రాజ్ ఠాక్రే ఇచ్చిన అల్టిమేటం గురించి ప్రస్తావిస్తూ సేన అధిపతి దివంగత బాల్ ఠాక్రే ఒక్కరే ప్రభుత్వాలకు అల్టిమేటం ఇచ్చే శక్తి సామర్ధ్యాలు, సత్తా ఉన్నాయని స్పష్టం చేశారు.
నిరాశతో బీజేపీ లౌడ్స్పీకర్గా మారిన ఠాజ్ ఠాక్రే మొరుగుతున్నారని, ప్రజలు దాన్ని మూసివేస్తారని వ్యాఖ్యానించారు. కేంద్ర దర్యాప్తు ఏజెన్సీల క్షమాభిక్షతో రాజ్ ఠాక్రే కాషాయ పార్టీకి లౌడ్ స్పీకర్గా మారారని సంజయ్ రౌత్ ఆరోపించారు.