న్యూఢిల్లీ : పెరుగుతున్న ఖర్చులు, మందగించిన అమ్మకాల నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ ఇండియా భారత్లో ఉద్యోగాల కోతను మొదలు పెట్టింది. టెలివిజన్, గృహోపకరణాల విభాగంలో ఎగ్జిక్యూటివ్లు, ఉద్యోగులను తొలగిస్తున్నది. విశ్వసనీయ వర్గాల ప్రకారం వివిధ స్థాయిల్లో 80-100 మంది ఎగ్జిక్యూటివ్లను రాజీనామా చేయమని కంపెనీ యాజమాన్యం కోరింది. వీరిలో డైరెక్టర్ స్థాయి అధికారులు, టీమ్ లీడర్లు కూడా ఉన్నారు. ప్రపంచ మార్కెట్లో మెమొరీ చిప్స్ ధరలు రెట్టింపు కావడం, స్మార్ట్ఫోన్ల అమ్మకాలు తగ్గడం, ముడి సరకు ధరలు పెరగడంతో కంపెనీపై ఒత్తిడి పెరిగింది. రాయిటర్స్ కథనం ప్రకారం కంపెనీలో 2028 వరకు చిప్ల కొరత సంక్షోభం కొనసాగవచ్చు.
ఎకనమిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం కంపెనీలోని సేల్స్, మార్కెటింగ్ సిబ్బందిలో 25 శాతంపై ఉద్యోగ కోతల ప్రభావం ఉండొచ్చు. మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా నియమించుకొన్న సిబ్బందిపైనా కోతల ప్రభావం ఉండనుంది. బాధిత ఉద్యోగుల సమాచారం ప్రకారం.. కొన్ని రోజులుగా చిన్న బ్యాచ్ల వారీగా కంపెనీ వారికి ఉద్వాసన లేఖలు జారీ చేస్తున్నది. కొందరిని నోటీస్ పీరియడ్ పూర్తి చేయకుండానే వెంటనే కంపెనీని వదిలి వెళ్లాలని కోరుతున్నది. తొలగిస్తున్న ఉద్యోగులకు మూడు నెలల జీతంతో పాటు, వారి సర్వీసులో ప్రతి సంవత్సరానికి ఒక నెల జీతాన్ని మేనేజ్మెంట్ ఆఫర్ చేస్తున్నది.