Diabetes | న్యూఢిల్లీ, అక్టోబర్ 7: భారతీయులు ఇష్టంగా తినే పలు ఆహార పదార్థాలు మధుమేహానికి కారణం అవుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. సమోసా, పకోడీ, ఫ్రైడ్ చికెన్, చిప్స్, బిస్కెట్లు, కేక్స్, రెడీమేడ్ మీల్స్, మయోనైజ్, గ్రిల్ చికెన్, బీఫ్, డ్రై నట్స్, వేయించిన వాల్నట్స్ వంటివి డయాబెటిస్ పెరిగేందుకు దోహదం చేస్తున్నాయని వెల్లడైంది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ రిసెర్చ్, మద్రాస్ డయాబెటిస్ రిసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 38 మంది అధిక బరువు, స్థూలకాయంతో బాధపడుతున్న 25-45 ఏండ్ల వయస్కులను పరీక్షించగా వారిలో బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 23 కంటే అధికంగా ఉన్నదని తెలిసింది. దీనికి సంబంధించిన అధ్యయనం ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్సెస్ అండ్ న్యూట్రిషన్లో ప్రచురితమైంది.