Lucknow | బీజేపీనుంచి వరుసగా నేతలు చేరడంతో సమాజ్వాదీ ఫుల్ జోష్లో వుంది. ఈ జోష్లోనే అభ్యర్థుల మొదటి జాబితాను కూడా గురువారం విడుదల చేసింది. మిత్రపక్షం ఆర్ ఎల్ డి, సమాజ్వాదీ కలిపి మొత్తం 29 సీట్లతో కూడిన జాబితాను విడుదల చేశారు. ఇందులో 9 సీట్లలో సమాజ్వాదీకి, 20 సీట్లలో ఆర్ ఎల్డీకి దక్కాయి. ఈ మేరకు ఆర్ ఎల్డి అధ్యక్షుడు జయంత్ సింగ్ ట్వీట్ చేశారు. అభ్యర్థుల గెలుపు కోసం అందరూ ఉమ్మడిగా, కలిసికట్టుగా కృషి చేస్తారన్న నమ్మకం తనకుందని ట్విట్టర్లో విశ్వాసం వ్యక్త చేశారు. ఆర్ ఎల్డీ, సమాజ్వాదీ కలిసి, యూపీలో ఓ మార్పును తీసుకొస్తామని ఇరు పక్షాలు ప్రకటించాయి.