తిరువనంతపురం: శబరిమల వెళ్తున్న బస్సు బోల్తా పడింది. (bus overturns) ఈ ప్రమాదంలో 17 మంది అయ్యప్ప భక్తులు గాయపడ్డారు. కేరళలో ఈ సంఘటన జరిగింది. కర్ణాటకకు చెందిన 43 మంది భక్తులు కేరళలోని శబరిమలకు బస్సులో బయలుదేరారు. బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో కొట్టాయంలోని ఎరుమేలి ప్రాంతంలో ఆ బస్సు బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది అయ్యప్ప భక్తులు గాయపడ్డారు. 15 మందిని కంజిరపల్లి ఆసుపత్రికి, తీవ్రంగా గాయపడిన ఇద్దరిని కొట్టాయం మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న భక్తుల కుటుంబాలు ఆందోళన చెందాయి.
కాగా, సోమవారం కేరళలోని కోజికోడ్ జిల్లా చెవాయూర్లో ఘోర ప్రమాదం జరిగింది. రెండు ప్రైవేట్ బస్సుల మధ్య ద్విచక్ర వాహనం ఇరుక్కుని నలిగిపోయింది. దానిపై ప్రయాణించిన భార్యాభర్తలు మరణించారు. ప్రైవేట్ బస్సు వెనుక నుంచి బైక్ను ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది.