పతనంతిట్ట (కేరళ), నవంబర్ 16: శబరిమల అయ్యప్పస్వామి ఆలయ ద్వారాలు బుధవారం సాయంత్రం తెరుచుకున్నాయి. 41 రోజుల మండల పూజను పురస్కరించుకొని ఆలయాన్ని తెరిచారు. కరోనా కారణంగా గత రెండేండ్లు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించిన ఆలయ యాజమాన్యం.. ఈ సారి భక్తుల సంఖ్యపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ఇదే సమయంలో ఈ సారి అయ్యప్ప మండల పూజ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఆలయ యాజమాన్యం నిర్ణయించింది. అలాగే జ్యోతి దర్శనానికి లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశముందని అంచనా వేసిన యాజమాన్యం ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నది.