ప్రచారం
కొవిడ్ టీకా రెండో డోసుకు, ప్రికాషన్ డోసుకు మధ్య కాల వ్యవధిని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇంతకు ముందు 9 నెలలుగా ఉన్న గ్యాప్ను 6 నెలలకు మార్చింది. ఈ మేరకు శుక్రవారం నేషనల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్(ఎన్టీఏజీఐ) సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.
వాస్తవం
రెండో డోసుకు, ప్రికాషన్ డోసుకు మధ్య కాల వ్యవధిని కేంద్రం తగ్గించలేదు. ఎన్టీఏజీఐ సమావేశంలో ఈ అంశంపై చర్చే జరగలేదు. రెండో డోసు వేసుకొన్నవాళ్లు ఇప్పటి వరకు ఉన్నట్టుగానే 9 నెలల తర్వాతనే ప్రికాషన్ డోసు వేసుకోవాలి.