DD Logo | దూరదర్శన్ లోగోలోని రంగు మార్పుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రసార భారతి మాజీ సీఈవో, టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు దూరదర్శన్ ఛానెల్ లోగోను కాషాయంగా మార్చేసిందని.. ఇది చూసి తాను మనస్థాపానికి గురయ్యానన్నారు. వాస్తవానికి డీడీ న్యూస్ ఇటీవల సోషల్ మీడియా ద్వారా లోగోను విడుదల చేసింది. అప్పటి నుంచి దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రంగును ఎందుకు మార్చాని పలువురు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే మాజీ సీఈవో జవహర్ సర్కార్ సైతం ప్రశ్నలు లేవనెత్తారు. లోగోను చూస్తుంటే ప్రసార భారతి కాదు.. ప్రచార భారతిని తలపిస్తుందన్నారు.
జవహర్ సర్కార్ 2012 నుంచి 2016 వరకు ప్రసార భారతి సీఈవోగా పని చేశారు. బ్రాండింగ్ కోసం కాషాయరంగును ఎంచుకోవడం ఏమాత్రం తగదన్నారు. ఈ చర్య ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనన్నారు. ఈ కాషాయ రంగు ఓటర్లను ప్రభావిస్తుం చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జవహర్ సర్కార్ ఆరోపణలపై ప్రసార భారతి ప్రస్తుత సీఈవో గౌరవ్ ద్వివేది స్పందించారు. ఇది ఆరెంజ్ కలర్ అని, ఛానల్ గ్రాఫిక్స్ ఆకర్షణీయంగా ఉండేలా ఈ రంగును ఉపయోగించామన్నారు. కేవలం లోగోమాత్రమే కాకుండా.. కొత్త లైటింగ్, పరికరాలతో సహా ఛానెల్ని అప్గ్రేడ్ చేసినట్లు పేర్కొన్నారు.
National broadcaster Doordarshan colours its historic flagship logo in saffron!
As its ex-CEO, I have been watching its saffronisation with alarm and feel —
it’s not Prasar Bharati any more
— it’s Prachar Bharati! https://t.co/a2r6zBLc3C— Jawhar Sircar (@jawharsircar) April 18, 2024