న్యూఢిల్లీ, జూన్ 21: ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రతినిధిగా వ్యవహరిస్తున్న టీఎస్ తిరుమూర్తి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో రుచిరాను కేంద్రప్రభుత్వం ఎంపిక చేసింది. 1987 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన రుచిరా ప్రస్తుతం భూటాన్లో భారత రాయబారిగా పనిచేస్తున్నారు.