కోల్కతా: సమాచార హక్కు కార్యకర్త సాకేత్ గోఖలే తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. గురువారం ఢిల్లీలో జరిగిన టీఎంసీ కార్యక్రమంలో డెరెక్ ఓబ్రెయిన్, యశ్వంత్ సిన్హా తదితర నేతల సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరారు. ‘సాకేత్ గోఖలే ఒక ప్రఖ్యాత ఆర్టీఐ కార్యకర్త. ఆయన జర్నలిస్ట్గా తన వృత్తిని ప్రారంభించారు. చాలా ఏండ్లుగా జాతీయ ప్రాముఖ్యత ఉన్న సమస్యలపై సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వం నుంచి వివరణ కోరుతున్నారు. ఇటీవల ఆయన పెగాసస్ కోసం బ్యాంకు రుణాలు, బడ్జెట్ కేటాయింపులపై ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగారు’ అని టీఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది.